ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     మెదక్


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.


మెదక్ సముదాయం గురించి:

 

మెదక్ సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని హైదరాబాద్ జిల్లా పరిధికి చెందుతుంది.


మెదక్ సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 92కు అధికంగా కళాకారులను & 5 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి   ప్రోత్సాహం పెరుగుతూ ఉం

 

చెక్క కళ:

 

చెట్టులు మరియు వృక్షాలు, మానవుల ప్రాథమిక స్నేహితులు. మన ప్రతియొక్క అవసరాలకు మనము వృక్షాలను ఎదురు చూస్తాము. ఈ స్పురనయే చెక్క కళ యొక్క ఆరంభానికి సహాయం పడింది. చెక్కనుండి అనేక ఉపయోగకరమైన మరియు ఆలంకారిక హస్తకళా వస్తువులు చేయ బడుతాయి. ఆ కాలములలో, రోజూ ఉపయోగించే సరకులైన - ఆయుధములు, పాత్రలు, గోడ్డలిలు మొదలైనవి మరియు పిల్ల కోసం బొమ్మలని చెక్కతో చేసేవారు. మహేన్జోదారో మరియు హరప్పా లోని పురాతత్వ త్రవ్వకాలు, ప్రాచీన భారతీయ చెక్కకళకు ఆధారాన్ని అందించాయి. సాధారాణ రూపాలు, ఆకారాలు మరియు అపక్వమైన ఉపయోగి పరికరాలనుంచి ప్రారంభించి, భారతీయ చెక్కకళ అభివృద్ధి పొంది, ఈ నాడు ఉపఖండములోనే అతి సుందరమైన మరియు పరిపూర్ణ హస్తకళగా ఎదిగింది.

 

ఉపయోగించే ముడి పదార్థాలు:


తాపిన పదార్థాల కళా మౌల్యం ఎక్కువగా ఉంటుంది. వీటి బిరుసైన దరకు ఉత్పాదనకైయ్యే ఖర్చుకన్న, కళాకారుడి కుశలత మరియు కళాత్మకత కారణం. ఈ నయమైన వస్తువుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలంటే ముఖ్యంగా నూకమాను, వివిధ రంగుల చెక్కలు, దంతం, ప్లాస్టిక్, వడ్రంగి బంక (వజ్రం), పాలిష్, మడ్డిమైనం, దంత నలుపు, శ్రీవాసం, ఇసుక కాకితం మరియు స్క్రూవులు, పిన్నులు, మొల మరియు ఉంగురంలాటి ఇనుప సామానులు.


వడ్రంగులు ఉపయోగించేటువంటి ఉపకరణములైన  ఉలి, రంపం, సమత, సుత్తె, రంపపు పలక, బిగుపు తాడు, ఆకురాయి, స్పోక్ షేవ్, కటూని, బ్రడాల్, స్క్రెవ్ డ్రైవర్, ఇసుక కాకిత మొద్దు, వింగ్ కొంపాసు, ట్విస్ట్ పిడిసాన, పదును పెట్టె రాయి మొదలైనవి ఈ కళాకారులకు కూడా అంతే అవసరం.ఈ ఉపకరణాలు వడ్రంగి మరియు తాపు పనుల వారికి సామాన్యం కాబట్టి, దీని గురించి ఎక్కువ చెప్పడంలేదు. తాపిన పదార్థాల తయారీలో కావలిసిన ఉపకరణాల వివరణలను ఈ కింద ఇవ్వబడి ఉంది.


ప్రక్రియ:


నూకుమాను మీద వివిధ రంగుల చెక్కలను తాపు వేసే ఉత్పాదక ప్రక్రియను కింద ఇవ్వబడిన ఎనిమిది ఘట్టాలుగా చెప్పవచ్చు:-

1.    పలకలను చేయటం

2.    టెంప్లేట్లను కోయడం

3.    తాపు కోసం వివిధ రంగుల చెక్కలను కోయటం

4.    తాపు చేయటం

5.    లప్ప వేయటం

6.    తాపు వేసే పైతట్టును మెత్తపరిచటం

7.    చెక్కడము మరియు బెజ్జం వేయటం

8.    ఫినిషింగ్



మొదటి ఘట్టంలో, అంటే పలకలను చేసే పనును వడ్రంగులు నిర్వహిస్తారు. టెంప్లేట్లను కోయడం, మరియు క్రమంగా రెండవ మరియు ఏడవ ఘట్టాలైన చెక్కడము మరియు బెజ్జం వేయటంలను మామూలు కళాకారుడు చేయలేడు కాబట్టి, వొక కుశలతగల కళాకారుడు ఈ రెండు పనులను చేస్తాడు. ప్రతిమలను కోసేవారు కూడా కుశలతగల కార్మికులే మరియు వీరు మూడవ ఘట్టం పని చేస్తారు, అంటే తాపుకోసం వివిధ రంగుల దంతం మరియు చెక్కలను కత్తెరించడం. నాలుగవ ఘట్టం పనియైన తాపు వేయటంను తాపు పనులవారు చేస్తారు. క్రమంగా ఐదవ, ఆరవ మరియు ఎనిమిదో ఘట్టం పనులను, అంటే లప్ప వేయటం, తాపు వేసిన పైతట్టును మెత్త పరిచటం మరియు ఫినిషింగులను ఫినిషింగ్ పనికోసం ఉండేవంటి కళాకారులు చేస్తారు.


1.పలకలను చేయటం:


కత్తెరించిన నూకుమాను మొద్దులను ¾" దళసరి ఉన్న పలకలుగా రంపంతో కోయబడుతుంది. ఈ కోయడాన్ని చేతిరంపం మరియు కట్టురంపం ఉపయోగించి చేస్తారు. మొద్దయొక్క ప్రమాణము పలక నిడువు మరియు వెడల్పును నిర్ధరిస్తుంది. ఒక గుండ్రని రంపముతో పలకములో ఉన్న మిట్టా పల్లములను సరిచేయబడుతుంది. తరవాత ఒక చేతిరంపాన్ని ఉపయోగించి పలకను సామాన్యమైన చౌకాకారంలో కత్తేరిచబడుతుంది.  పలకుముయోక్క అమితమైన చెక్కను కొయ్య సుత్తె మరియు ఉలి ఉపయోగించి పలకను అండాకారంలో కత్తెరిస్తారు. దాన్ని గుండ్రంగా చేసేందుకు కూడా ఇదే ప్రక్రియను పాలిస్తారు. ఈ రోజుల్లో డైసీలను తరిమెనబడుతాయి. పలకయొక్క రెండూ పైతట్టులను సమత చేసే మూలకంగా మెత్తగా చేయబడుతుంది.


వివిధ రంగుల మొద్దుకట్టెలను సహా ఇదే విధంగా 1 /8" దలసరిగల సన్న షీట్లుగా రంపంతో కోయబడుతాయి. చేతిరంపాన్ని ఉపయోగించేప్పుడు ఇంత సన్న రేకులను కోయ్యాలంటే ఉపకరణాలను అందమైన రీతిలో తిప్పగలగాలి. నష్టాన్ని తక్కువపరిచేందుకు చేతిరంపం ఉపయోగించిన తరవాత, కొన్ని సంస్థలలో దొరికే విద్యుత్తు సహాయంతో నడిచే ఉపకరణాలను ఉపయోగించేందుకు కార్మికుడుకి స్వాతంత్ర్యం ఇవ్వబడుతుంది. కావలిసిన ఆకారంలో పలకలను కత్తెరించడం మరియు ఈ పలకాల పైతట్టును మెత్త చేయడం, మొదలఘట్టాన్ని సూచిస్తుంది మరియు వస్తువును పని ప్రారంభిచేందుకు యోగ్యముగా చేస్తుంది. ఈ ఘట్టం వరకున పనులను వడ్రంగులు చేస్తారు.


2.టెంప్లేట్లను కోయడం:


తాపుపనికి కావలిసిన విన్యాసాలను ఈ సంస్థలకు చెందని, స్వతంత్ర డిసైనర్లు ఇస్తారు.విన్యాసాలు డిసైనర్ల సృష్టి. ఒక డ్రాయింగ్ పేపర్ మీద రూపువేసిన ప్రతి విన్యాసానికి  నీటివర్ణంతో రంగునివ్వబడుతుంది.


 టెంప్లేటును చేసే కళాకారుడు విన్యాసాన్ని చదువుతాడు. మూల విన్యాసం పై పెట్టిన ఒక పారదర్శక కాకితం మీద పెన్సిల్ తో విన్యాసంయొక్క జాడ తీయబడుతుంది. జాడ తీసిన కాకితాన్ని ఒక సన్న అట్టకు అతికించి, ఒక కరకైన ఉలితో టెంప్లేటులను కోస్తారు. విన్యాసాన్ని గురుతిచేందుకు ఉపయోగించే వర్ణాకృతిల సంఖ్యను ఆధరించి టెంప్లేట్ల ముక్కల సంఖ్య నిర్దారింపబడుతుంది.ఒక జాడను 30 & 100ల నడుమ ఉన్న ప్రత్యెక ముక్కలుగా కత్తేరిచబడుతాయి.


3.తాపు కోసం వివిధ రంగుల చెక్కలను కోయటం:


మొదట విన్యాసంలో ఉన్నట్టు కోసిన వివిధ రంగుల చెక్కల రేకులు మరియు ముఖం, కాళ్ళు మరియు చేతులను చేసేందుకు దంతాన్ని ఎంపిక చేయబడుతుంది.  కోసిన టెంప్లేటులను క్రమంగా కావలిసిన రంగున్న రేకు మీద పెట్టి దాన్నియొక్క జాడును చెక్క లేక దంతం పై పెన్సిల్తో తీయబడుతుంది.


చెక్క రేకును సుడి మీద గట్టిగా బిగించి, ఒక రంపంతో విన్యాసాన్ని కత్తెరిస్తారు. రంపంయోక్క బ్లేడుపండ్లు కత్తేరించబోయే రేకుకు లంబకోనములో  ఉండేదట్లు పెడతారు. రంపంతో వక్రాలను కొసేదప్పుడు బ్లేడును మెత్తగా తిప్పబడుతుంది.  కళాకారుడు ఒక పీఠం మరియు సుడి (సుడి లేనప్పుడు రంప ఫలకంను ఉపయోగిస్తారు) మీద కూర్చుని, ఒక చేతిలో రేకును మరియు మరొక్క చేతిలో రంపాన్ని ఉపయోగిస్తాడు. ముక్కలను కత్తేరించిన తరవాత గరుకైన అంచులను ఒక మెత్తని ఆకురాయితో నున్నగా చేయబడుతుంది.


4.తాపు చేయటం:


చెక్క మరియు దంతపు రేకుల నుంచి కత్తేరించిన వివిధ భాగాలను కావలిసిన నమూనాలో చేర్చి, బంకను ఉపయోగించి అన్ని భాగాలను అతికించబడుతుంది. ముక్కల ఆకారం ముక్కలు అంటుకుపోవాడాన్ని ప్రేరేపిస్తుంది. విన్యాసంయోక్క భాగాలను తాపు వేయలిసిన ఫలక మీద పెడతారు. కొయ్య సుత్తెను ఉపయోగించి పలకమీద విన్యాసంయోక్క పరిపూర్ణ మరియు స్పష్టమైన అచ్చును సృష్టిస్తారు. తరవాత విన్యాసాన్ని తీసి, అచ్చు మూడిన గురుతు మీద కాచు చిర్ణను సుత్తెతో కొట్టి వేలాడతీస్తారు.


గురుతించిన భాగాన్ని మట్టచిర్ణ మరియు సుత్తేలను ఉపయోగించి తోడుతారు.


మట్ట చిర్ణను కూడా ఫర్మెర్ చిల్సులాగే తిప్పబడుతుంది. ఈ చెక్కను కూడా, చెక్క మరియు దంతపు రేకులలాగే 1 /8 " లోతుకు తవ్వబడుతుంది. దీనివల్ల తాపిన విన్యాసాన్ని సులభంగా చెక్కలో చేర్చవచ్చు. తాపిన విన్యాసాన్ని నిలకడగా పెట్టాలి కాబట్టి ఈ పనును చాలా జాగ్రతగా చెయ్యాలి. వట్గా చిర్ణ మరియు కొయ్య సుత్తెల సహాయంతో కళాకారులు, నేలలోకి తాపిన విన్యాసాన్ని పెట్టె ముందు, గరుకైన పైతట్టును బాగు చేస్తారు.


పలకయోక్క తవ్వబడిన స్థలములో వడ్రంగి బంకను పూసి, కళాకారుడు సుత్తెతో జాగ్రతగా కొట్టి, తాపిన విన్యాసాన్ని నెలకు చేర్చుతాడు. సాధారణమైన తాపు విన్యాసాలకు కొన్ని సెట్టింగులు మరియు క్లిష్టమైన తాపువిన్యాసాలకు ఎక్కువ సెట్టింగులు కావలిసి ఉంటాయి.


నెలలో పెట్టెవంటి అన్ని తాపువిన్యాసపు ముక్కలకు చెక్కపు పనివాళ్ళు డిసైనురులు ఇచ్చిన మూల విన్యాసంలో ఉన్నట్టుగానే పరస్థల ఆకారాలను గుర్తించి, తాపు కళాకారుడికి తిరిగి ఇస్తారు. కళాకారుడు చెక్కను తవ్వి డస్సి చిర్ణతో ఇరుకైన రంధ్రాలను చేసి డస్సి(రంపంతో చెక్కిన సన్న చెక్కపు తునకలు) లేక ఇరుకైన తాపును పెడతారు. నెలలో తాపు విన్యాసాన్ని పెట్టిన తరవాత, ఖాలి ఉన్న స్థలాలలో ఆకులు, పువ్వులు మరియు ఇతర విన్యాసాలను వర్ణించే ప్లాస్టిక్ ముక్కలను పెడతారు.


5.లప్పా వేయటం:


నూకుమానుని చేక్కినప్పుడు దొరికే చెక్కపుపొడికు వడ్రంగి బంకను కలిపి చేసే, లప్పా, అనే పిండిని పూసి తాపిన పైతట్టు మీద ఉన్న ఖాలి స్థానాలను నింపుతారు. సందులలో పూర్తిగా చేరేవరకు ఈ లప్పాను కొన్ని గంటల పాటు ఊరపెట్టి, అనావశ్యమైన పదార్థాలను చెక్కి తీస్తారు.


6.తాపు వేసే పైతట్టును మెత్తపరిచటం:


తాపిన వస్తువు గరుకైన పైతట్టును పొంది ఉంటుంది. దీనికి ఒక మృదువైన ఫినిష్ ఇవ్వాలి. గరుకైన పైతట్టును ముల్లాకురాయిని ఉపయోగించి కళాకారుడు ఒక సమతైన పైతట్టును తయారిస్తాడు. ఈ పైతట్టును మళ్ళి చెక్కడం మూలకంగా మెత్తపరిస్తాడు. దీని మూలకంగా ఒక మెత్తని ఫినిష్ దొరకుతుంది. ఈ ప్రక్రియ తరవాత ఒక నాణ్యమైన ఇసుకుకాకితాన్ని ఉపయోగించి బాగా రాపిడి చేయబడుతుంది.


7.చెక్కడము మరియు బెజ్జం వేయటం:


తాపు వస్తువుకి ఫినిషింగ్ ఇచ్చే ముందు, విన్యాసంయోక్క ప్రతిమపై  కళ్ళు, ముక్కు, నోరు మరియు చేవ్వులను గురుతిస్తారు. దీన్ని కుశలతగల ఒక చెక్కపు పనివాడు చేస్తాడు. ఛాయా వేసే మరియు చెక్కే ఉపకరణాలను పెన్సిల్ తిప్పినట్టుగానే తిప్పబడుతాయి. చెక్కపు పనివాడు ఉత్తమ ఛాయను రప్పించి విన్యాసాన్ని పూర్తీ చేస్తాడు. ఆకు, పువ్వు, గుండ్రపు ఆకారాలు, చౌకాకారాలు, చుక్కలాంటి ఆకారాలను వేసిన తరవాత, అంచు మరియు నమూనాల వస్త్రాల విన్యాసాలు చేయబడుతాయి. తాను వేసిన గురుతలను గురుతించేందుకు, చెక్కపు పనివాడు చెక్కిన, ఛాయా వేసిన మరియు బెజ్జం వేసిన గురుతల మీద దంత నలుపును, సన్న ప్రమాణంలో చెల్లుతాడు. దంత నలుపు ఈ కానాలలో వెళ్లి గురుతులు ఎక్కువ గాడంగా కనిపించేదట్టు చేస్తాయి.


8.ఫినిషింగ్:


ఫినిషింగ్, తాపు వేసే పనియొక్క ఆకరి ఘట్టం. చెక్కడపు పని పూర్తైన తరవాత, మడ్డిమైనము మరియు దంత నలుపును 4 :1 అనుపాతంలో కలిపి, కాస్త శ్రీవాసాన్ని చేర్చి, బ్లాక్ పోలిష్ అనే మిశ్రణాన్నిపూసి, ఎండపెడతారు. ఈ పాలిష్ ఎండిన తరవాత గోకి తీయబడుతుంది. నునుపైన ఫినిష్ కోసం, ఈ ముక్కలను ౦ గ్రేడ్ ఇసుకుకాకితంతో రుద్దబడుతుంది. ఆకరికి తాపిన వస్తువు పైన లక్క పాలిషుయొక్క రక్షణా పదరాన్ని పూయబడుతుంది. గుడ్డతో ఈ పాలిషుయొక్క అనేక పదరాలు వేయబడి, ప్రతి పదరాన్ని చింపిగుడ్డతో బాగా రుద్దబడుతుంది.



ప్రక్రియలు:


1.    పలకలను చేయటం

2.    టెంప్లేట్లను కోయడం

3.    తాపు కోసం వివిధ రంగుల చెక్కలను కోయటం

4.    తాపు చేయటం

5.    లప్ప వేయటం

6.    తాపు వేసే పైతట్టును మెత్తపరిచటం

7.    చెక్కడము మరియు బెజ్జం వేయటం

8.    ఫినిషింగ్


 

వాయు సంపర్కం:

 

జాతీయ మరియు అంతర్జాతీయ విమానాలతో హైదరాబాదు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థలములకు ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. హైదరాబాదులో రెండు విమానాశ్రయాలను ఉన్నాయి, రాజివ్ గాంధి విమానాశ్రయం ఒకఅంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఎన్. టి. రామారావు విమానాశ్రయం నగరంలోని జాతీయ విమానాశ్రయం.

 

రోడ్డు సంపర్కం:

 

హైదరాబాదులో ఒక భారీ బస్సు నిల్దాణం ఉంది మరియు దీనివల్ల రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఒక రహదారుల జాలంనుండి ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్ టి సి) బస్సులు మరియు

 

ఇతర దక్షిణ భారతీయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సుల సేవలు లభిస్తాయి. ఎపిఎస్ ఆర్ టిసి కూడా నగరం చుట్టూ అనేక వేడుకలు మరియు విహారాలను నడపుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్ టి సి)హైదరాబాదును రాష్ట్రంలోని కొన్ని చిన్న గ్రామాలను తప్ప, ప్రతియొక్క నగరం,పట్టణం మరియు అన్ని గ్రామాలకు సంప్రదించుతుంది. వివిధ నగరములు మరియు రాష్త్రముల కోసం ఎక్ష్ప్రెస్స్ మరియు లక్షురి కోచుల సేవలు కూడా లభ్యంఉన్నాయి.

 

రైలు సంపర్కం:

 

ఒకే నిర్వాహం క్రిందున్న, ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వేయైన భారతీయ రైల్వేను తొమ్మిది వలయాలుగా విభాగించారు. దక్షిణ కేంద్ర వలయంయొక్క ప్రధాన కేంద్రం హైదరాబాదు జంటి నగరమైన సికందరాబాదు. ఆగమనం మరియునిర్గమనానికి హైదరాబాదు ప్రముఖ కేంద్రం. హైదరాబాదు రైల్వే నిల్దాణం, హైదరాబాదును అన్ని ప్రముఖ భారతీయ నగరాలకు సంప్రదించేందుకు బహుసంఖ్యల రైళ్ళ సంపర్కాన్ని పొంది ఉన్నది.








ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     విశ్వకర్మ